మంథని: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శనివారం రాజగృహాలో నియోజకవర్గంలోని మండలాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన, కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్యారెంటీ కార్డులతో నిరసనలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ మోసాలపై కదం తొక్కాలి: పుట్ట మధూకర్
◷ August 29, 2026 | telangananetramtv


Leave a Reply