కాంగ్రెస్‌ మోసాలపై కదం తొక్కాలి: పుట్ట మధూకర్‌

మంథని: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆరోపించారు. శనివారం రాజగృహాలో నియోజకవర్గంలోని మండలాల నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన, కేటీఆర్‌ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్యారెంటీ కార్డులతో నిరసనలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *