గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన 16 మందిని గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వెంకట సచిన్ రెడ్డి ఎదుట హాజరుపరచగా, 15 మందికి రూ.41,500 జరిమానా విధించారు. కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ్రత పనులు చేయించారు. మరో వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధించడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒకరికి 7 రోజుల జైలు
◷ September 5, 2026 | telangananetramtv


Leave a Reply