గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి..

సిట్టింగ్‌లకు చెక్..

కొత్త ముఖాలకే ప్రాధాన్యం?

గులాబీ దళంలో సీట్ల రాజకీయ వేడి.. : తెలంగాణ గులాబీ దళంలో ‘సీట్ల’ రాజకీయం ఊపందుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ఏకైక ప్రామాణికంగా భారత్ రాష్ట్ర సమితి అధినాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది.

గతంలో పాటించిన సాంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి నియోజకవర్గాల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు (సిట్టింగ్లు) చాలా మందికి టికెట్ల కోత తప్పదని సమాచారం. నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన సిట్టింగ్లకు చెక్ పెట్టి, కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం.

ఆలోచనలో గులాబీ..

తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీలో ఉన్న సిట్టింగులను పక్కనబెట్టి కొత్త ముఖాలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చకపోవడంతోనే అధికారం కోల్పోయామనిఅనేక సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు సైతం కామెంట్స్ చేశారు.దీంతో ప్రస్తుతం ఉన్న గులాబీసిట్టింగులను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా వారి క్లిన్ ఇమేజ్ గెలుపునకు దోహదం చేస్తుందని అధిష్టానం లెక్కలు వేస్తోందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *