
మంథని: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన విలేకరులు బూడిద రాజు, కొయ్యల రాజమల్లు, తగరం రాజులను ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో విలేకరుల పాత్ర కీలకమని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. అణగారిన వర్గాల సమస్యలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సేవలను అభినందించారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Leave a Reply