అంతర్గాం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్ రెడ్డి అనారోగ్యంతో ఉన్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దంపతులు బుధవారం గోలివాడలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా హనుమాన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
హనుమాన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే దంపతులు
◷ August 12, 2026 | telangananetramtv


Leave a Reply