
సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రామగుండం నియోజకవర్గం సుభిక్షంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


Leave a Reply