
మల్లికార్జున ఖర్గే గారిని అవమానించేలా బీజేపీ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఐబీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Leave a Reply