మంథని: అమెరికా పర్యటన ముగించుకొని మంథనికి చేరుకున్న పుట్ట మధు దంపతులకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. చందనాపూర్, సింగిరెడ్డిపల్లి, సుందిళ్ల, ముస్త్యాల, పేదంపేట గ్రామాలకు చెందిన నాయకులు పుట్ట మధును కలిసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యండి. ఇబ్రహీం, బోగిరి భాస్కర్, సత్తన్న, రాజు, కామ శ్రీను, కోనేటి సతీష్, నరేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు.


Leave a Reply