Aug 25, 2026, నేడు దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్షతెలంగాణ : దేవాదుల ఎత్తిపోతల పథకం పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్యాకేజీల వారీగా ప్రాజెక్టు భౌతిక, ఆర్థిక పురోగతిని అధికారులు మంత్రికి వివరించనున్నారు. ప్రాజెక్టు పూర్తికి ఆటంకంగా మారిన భూసేకరణ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, మిగిలిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించనున్నారు.
నేడు దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
◷ August 25, 2026 | telangananetramtv


Leave a Reply