
గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి గోరింటాకు వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మహిళలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందస్తు జన్మదిన వేడుకలను మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించి కేక్ కట్ చేశారు. పాటలు, నృత్యాలతో మహిళలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.


Leave a Reply