గోదావరిఖని: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని TGSRTC గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో 9 రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని 7 జ్యోతిర్లింగాలు, 2 శక్తిపీఠాలను భక్తులు దర్శించుకోనున్నారు. ఒక్కొక్కరికి రూ.11,500 ఛార్జీగా నిర్ణయించారు. సీట్ల రిజర్వేషన్ కోసం 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కవిత తెలిపారు.
గోదావరిఖని నుంచి 4 రాష్ట్రాలకు ఆధ్యాత్మిక యాత్ర
◷ August 16, 2026 | telangananetramtv


Leave a Reply