రామగుండం: కురుమ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.కురుమ సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని మనాలి ఠాకూర్ పేర్కొన్నారు.



Leave a Reply