పెద్దపల్లి, ఆగస్టు 18: బీసీ నిరుద్యోగ మహిళలకు 100 శాతం సబ్సిడీతో రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి తెలిపారు. 18–55 ఏళ్ల బీసీ మహిళలు, రేషన్ కార్డు కలిగి ఉండి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు వార్షిక కుటుంబ ఆదాయం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. అర్హులు సెప్టెంబర్ 15లోపు ఆన్లైన్లో https://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్క కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తామని తెలిపారు.
ఇందిరమ్మ కుట్టు మిషన్కు దరఖాస్తుల ఆహ్వానం
◷ August 18, 2026 | telangananetramtv


Leave a Reply