అకడమిక్ ప్యానల్ తనిఖీలకే పరిమితం కాకూడదు: కలెక్టర్ కోయ శ్రీహర్ష

హైదరాబాద్, ఆగస్టు 13(తెలంగాణ నేత్రం)అకడమిక్ ప్యానల్ పాఠశాల సందర్శనలు కేవలం తనిఖీలకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు అకడమిక్ సహకారం అందించేలా ఉండాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారుల శిక్షణలో పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న అకడమిక్ ప్యానల్ విధానంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తరగతి గది పరిశీలన, విద్యార్థుల స్పాట్ అసెస్‌మెంట్, నిర్మాణాత్మక ఫీడ్‌బ్యాక్, డేటా ఆధారిత ప్రణాళిక, నిరంతర ఫాలోఅప్ ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *