యూపీలో NDAకు షాక్,

SHARE THIS

పెరుగుతున్న INDIA గ్రాఫ్..

తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు

యూపీలో NDAకు షాక్,:ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే యూపీలో ఎన్డీఏకు షాక్ తప్పదు అనేలా ఓ సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికలపై మూడ్ ఆఫ్ నేషన్ సంస్థ ఆగస్టు 2026కు సంబంధించి నర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో ఇండియా కూటమికి 41 సీట్లు వస్తాయని తేలింది. ఎన్డీఏ కూటమికి 38 సీట్లు వస్తాయని తేలింది. జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీఏ 48 నుండి 38కి పడిపోగా, ఇండియా కూటమి 31 నుండి 41కి పెరగడం ఆశ్చర్యకరం. ఓట్ల శాతం విషయానికి వస్తే ఇండియా కూటమికి 40 శాతం ఓట్లు వస్తాయని ఫలితాలు చెబుతున్నాయి.
ఇది జనవరి సర్వేతో పోలిస్తే 2శాతం ఓట్లు తగ్గుతాయని సూచిస్తోంది. సర్వేలో అయోధ్యలోని రామ మందిర విరాళాల దొంగతనం వివాదం మోడీ, మోగి ప్రభుత్వాలు రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపించిందని 47శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఇది కేవలం కేంద్రాన్ని ప్రభావితం చేసిందని 8శాతం మంది, యూపీ ప్రభుత్వంపై మాత్రమే ప్రభావం చూపించిందని 7శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఫలితాల చూసిన తరవాత ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న యాంటీ ఇన్ కంబెన్సీకి ఈ రిజల్ట్స్ కారణమా అని విశ్లేషకులు భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *