గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
సింగరేణి ఆర్జీ-1 ఏరియాలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు ఉద్యోగులను సోమవారం జీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నాగేశ్వరరావు (ఏజీఎం–సివిల్ క్వాలిటీ), రాజాజీ (ఏజీఎం–ఇ&ఎం), బరుపటి పార్వతి (ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అటెండర్)లను ఆర్జీ-1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల సేవలు కీలకమని, పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని జీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం
◷ August 31, 2026 | telangananetramtv


Leave a Reply