రామగిరి: పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సీఏన్ సీఓఏ క్లబ్లో రామగుండం రీజియన్ సివిల్ క్వాలిటీ కంట్రోల్ సెల్ ఏజీఎం పల్లెర్ల నాగేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీ-3 జీఎం సుంకరి మధుసూదన్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. సంస్థకు నాగేశ్వరరావు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సివిల్ డీజీఎం రాజేంద్రకుమార్, సర్పంచ్ వనం రామచంద్రరావు, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బెల్లం శ్రీనివాస్, సింగరేణి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.



Leave a Reply