Aug 25, 2026, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం ఆంధ్రప్రదేశ్ : కర్నూలు శ్రీనివాస నగర్లో హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్ఎస్ఐ సుబ్బయ్య ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, సుమారు 23 తులాల బంగారం, 6 తులాల వెండి (మహేష్ ఇంట్లో), 5 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ. 30 వేల నగదు (సుబ్బయ్య ఇంట్లో) దోచుకున్నారు. ఒకే ప్రాంతంలో పోలీసుల ఇళ్లల్లో వరుస దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ, అనుమానితుల కోసం గాలిస్తున్నారు.
హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం
◷ August 25, 2026 | telangananetramtv


Leave a Reply