హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం

Aug 25, 2026, హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే దొంగతనం ఆంధ్రప్రదేశ్ : కర్నూలు శ్రీనివాస నగర్‌లో హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు, సుమారు 23 తులాల బంగారం, 6 తులాల వెండి (మహేష్ ఇంట్లో), 5 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ. 30 వేల నగదు (సుబ్బయ్య ఇంట్లో) దోచుకున్నారు. ఒకే ప్రాంతంలో పోలీసుల ఇళ్లల్లో వరుస దొంగతనాలు జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ, అనుమానితుల కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *