Aug 25, 2026, కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేతతెలంగాణ : గచ్చిబౌలి అంజయ్య నగర్ లో కూలిన భవనం సమీపంలోని మరికొన్ని ప్రమాదకర భవనాలను ఆదివారం సాయంత్రం నుండి అధికారులు కూల్చివేస్తున్నారు. వరద కాలువను ఆక్రమించి, అనుమతికి మించి ఏడెనిమిది అంతస్తులు నిర్మించడం వల్ల భవనం పటిష్టత దెబ్బతిన్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణదారుడు సయ్యద్ సాజిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాలువ ఆక్రమణ.. ప్రమాదకర భవనాలు కూల్చివేత
◷ August 25, 2026 | telangananetramtv


Leave a Reply