కాల్వ శ్రీరాంపూర్ ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా కష్టాల్లో ఉన్న కుటుంబానికి భరోసాగా నిలుస్తున్న కాల్వ శ్రీరాంపూర్ జడ్పిహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు మండలంలోని శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన పిల్లలమర్రి సదానందం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు తోటి స్నేహితులంతా కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాగా నిలిచారు 1998 -99 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు తలో కొంత పోగు చేసి 13 వేల రూపాయలను బ్యాంకులో సదానందం సునీత దంపతుల కూతురు మృదుల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి బాండ్ పేపర్ ను శనివారం వారి స్వగృహంలో అందించారు అసలే నిరుపేద కుటుంబం కూలిపోయిన ఇల్లు గుంట భూమిలేని పేదవారిని ఆదుకునేందుకు స్నేహితులంతా ఒకటై మేమున్నాము అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఇలాగే వారి స్నేహం కలకాలం ఉండాలని ఆపదలో ఉన్న కుటుంబాలకు మనోధైర్యం అందిస్తూ ఉండాలని వివిధ గ్రామాల ప్రజలు అన్నారు పరామర్శించిన వారిలో ఎండి రహీం, బంగారి నవీన్, ముస్కు అశోక్, కటకం శ్రీనివాస్, రాగుల వనమా చారి, మారుపాక ప్రవీణ్, మ్యాదరి సంపత్ తదితరులు ఉన్నారు
నిరుపేద కుటుంబానికి అండగా చిన్ననాటి స్నేహితులు
◷ August 8, 2026 | telangananetramtv


Leave a Reply