రామునిగుండాల కొండపై సామూహిక వరలక్ష్మి వ్రతం

గోదావరిఖని, ఆగస్టు 19(తెలంగాణ నేత్రం tv)
రామునిగుండాల కొండపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం (శ్రీరామపాద క్షేత్రం)లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈనెల 21న సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి తిరుపతి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా శ్రీలక్ష్మీదేవి డాలర్, పూజా సామగ్రి అందించడంతో పాటు అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, భక్తులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *