=రూ.9.43 లక్షల హుండీ ఆదాయం
=భక్తుల ఆదరణతో పెరుగుతున్న ఆదాయం
మంథని, ఆగస్ట్ 18(తెలంగాణ నేత్రం టీవీ) .రామగిరి మండలం, సుందిళ్ల గ్రామం లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి సన్నిధిలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ. 9,43,621/- ఆదాయం లభించింది. దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరుగుతోందని దేవస్థాన అధికారులు, పాలకవర్గం తెలిపారు..ఈ లెక్కింపు కార్యక్రమంలో పెద్దపల్లి డివిజన్ దేవాదాయ శాఖ పరిశీలకులు ఆర్. ప్రవీణ్,ఈఓ రాజ్ కుమార్, దేవస్థాన చైర్మన్ కోర కొప్పుల సత్యనారాయణ గౌడ్, ధర్మకర్తల మండలి సభ్యులు రేకుంట్ల రవి, శ్రీనివాసరావు, సమ్మయ్య, జనగామ హేమలత, అర్చకులు రుద్రభట్ల జయంతి శర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.


Leave a Reply