గోదావరిఖని: రామగుండంలో రేపు నిర్వహించనున్న భారీ సభకు సంబంధించిన ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో, పార్టీ నాయకులతో మాట్లాడిన ఎమ్మెల్యే సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నందున తాగునీరు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సభ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు.
సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
◷ August 18, 2026 | telangananetramtv


Leave a Reply