పెద్దపల్లి, ఆగస్టు 16: ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలు, వినతులు, ఇతర దరఖాస్తులను మండల స్థాయిలోనే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 17 నుంచి మండల స్థాయిలో ప్రజావాణి
◷ August 16, 2026 | telangananetramtv


Leave a Reply