Aug 13, 2026,
రేషన్ కోసం ఏటీఎం.. ఎలా పనిచేస్తుందంటే?
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దేశంలోనే తొలి ధాన్యం ఏటీఎంను వైశాలీ నగర్లో బుధవారం ప్రారంభించింది. ఎమ్మెల్యే రికేష్ సేన్ ఈ ఆటోమేటెడ్ ఏటీఎంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులు రేషన్ కార్డ్ లేదా ఆధార్ నంబర్, బయోమెట్రిక్ ద్వారా ధాన్యం పొందవచ్చని చెప్పారు. ఇది 24/7 అందుబాటులో ఉండి, రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచుతుందని, డీలర్లు, మధ్యవర్తుల దోపిడీని తగ్గిస్తుందని వెల్లడించారు


Leave a Reply