మంథని: బొక్కలవాగులో నీటిలో మునిగిపోతున్న బాలిక అలేఖ్యను ధైర్యసాహసాలతో రక్షించిన బోయినిపేటకు చెందిన అంకం శేఖర్, ఆకుల అరవింద్లను గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ అభినందించి సన్మానించారు.
బాలికను రక్షించిన అనంతరం ఆమె తండ్రి పర్శవేన రాజును కూడా వాగులో నుంచి బయటకు తీసేందుకు యువకులు ప్రయత్నించారు. అయితే అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి బాలిక ప్రాణాలు కాపాడిన యువకుల ధైర్యసాహసాలు అభినందనీయమని ఏసీపీ పేర్కొన్నారు. మంథని సీఐ బుద్ధె స్వామి, ఎస్ఐ సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply