జర్నలిస్టుల సమస్యలపై కేంద్రం స్పందన

హైదరాబాద్, ఆగస్టు 12: జంతర్ మంతర్‌లో టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల ధర్నాపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. టీడబ్ల్యూజేఎఫ్ సమర్పించిన వినతిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. జర్నలిస్టుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, చట్టపరమైన రక్షణ, సామాజిక భద్రత, కార్మిక హక్కుల అంశాలను పరిశీలించి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరింది. రైల్వే రాయితీ అంశంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. కేంద్రం సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *