కాంగ్రెస్ బలోపేతానికి సమష్టి కృషి

గోదావరిఖని: కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *