మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా

హైదరాబాద్: రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు, ప్రమాద సమయంలో ఆసుపత్రి చికిత్సకు గరిష్ఠంగా రూ.25 వేల వరకు బీమా రక్షణ లభించనుంది. 18 నుంచి 70 ఏళ్ల మధ్య నమోదిత మత్స్యకారులు ఈ పథకానికి అర్హులు. మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *