
మంచిర్యాల పరిధిలోని ఏసీసీ క్వారీ మార్గంలోని రాళ్లవాగు వంతెన వద్ద భారీ వర్షాలకు రహదారి దెబ్బతిని కుంగిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ హన్నన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు క్వారీ వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.



Leave a Reply