Aug 16, 2026,
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుంటేనే ఎరువులు: కేంద్రం
రైతులకు ఎరువుల సరఫరాలో కేంద్రం కీలక మార్పు తీసుకొచ్చింది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే ఎరువుల కోసం బుకింగ్ చేసుకునేలా నిబంధనలు అమలు చేయనుంది. ఇందుకోసం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణలో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.


Leave a Reply